Skip to content

కొమ్మ సంకేతం: వట సావిత్రీలో నిరంతరంగా ఉన్న మర్రి చెట్టు

  • by

వట వృక్షం, బార్గాడు లేదా మర్రి చెట్టు దక్షిణ ఆసియాలోఆధ్యాత్మికు కేంద్రముగా ఉంది, మరియు ఈ చెట్టు భారత దేశం యుక్క జాతీయ వృక్షం. ఇది మరణ దేవుడు అయిన యముడుతో ముడిపడి ఉండిది. కాబట్టి ఇది తరుచుగా స్మశాన వాటికల్లో దినిని నట్టుతారు. ఈ చెట్టు అమరత్వానికి చిహ్నంగా, గొప్ప దీర్ఘాయువు కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది తిరిగి మోలిచే సామర్థ్యంతో కలిగి ఉండే చెట్టు. తన భర్త అయిన రాజు సత్యవంతుడు ప్రాణాలను తిరిగి పొండుకోవటం కోసం సావిత్రీ మర్రి చెట్టు ద్వారా యముడితో బేరం కుదుర్చుకోవటం దాని ద్వారా ఆమెకు ఒక కుమారుడుని పొందవచ్చును – వట పూర్ణిమ, వట సావిత్రీ సంవత్సర వార్షిక వేడుకల్లో జ్ఞపకం చేసుకుంటారు.

ఇదే విధమైన తరహ ఒకటి హీబ్రు వేదలల్లో (బైబిలు)లో కనిపిస్తుంది. చనిపోయిన చెట్టు ఉంది… జీవంలోకి వస్తుంది… చనిపోయిన రాజుల నుండి ఒక క్రొత్త కుమారుని సూచిస్తుంది. దీనిలో ప్రధాన వ్యత్యాసం ఏమిటి అంటే భవిషత్తుల్లో కనిపించే ప్రవచనాన్ని వందలాది సంవత్సరాలుగా వివిధ  ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. వారి మిశ్రమ కథలో ఎవరోఒకరు వస్తున్నారు అని ఉహించారు. యెషయా (క్రీ.పూ 750) ఈ కథను ప్రారంభించాడు, తరువాత దేవుని-ప్రవక్తలు మరింత అభివృద్ధి చెందారు – చనిపోయిన చెట్టు నుండి కొమ్మ.

యెషయా, కొమ్మ (చిగురు)

యెషయా జీవించిన కాలం చారిత్రాత్మకంగా ధృవీకరరించే కాలంలో జీవించాడు, ఈ కాలం యూదుల చరిత్ర కలంలో తీసుకున్నది.

ఇశ్రాయేలు, దావీదు రాజులు కాలంలో చారిత్రాత్మకంగా ధృవీకరించే కాలక్రమంలో యెషయా జీవించాడు అని చూపించారు.

దావీదు రాజుల  రాజవంశం (క్రీ.పూ. 1000 – 600) యెరూషలేం నుండి పాలించినప్పుడు యెషయా రాశాడు. యెషయా కాలంలో (క్రీ.పూ 750) రాజవంశం, పాలన అవినీతిమయం. రాజులు దేవుని వద్దకు తిరిగి రావాలని, మోషే పది ఆజ్ఞలను పాటించాలని యెషయా విజ్ఞప్తి చేశాడు. ఇశ్రాయేలు పశ్చాత్తాపపడదని యెషయాకు తెలుసు, అందుచేత రాజ్యం నాశనమవుతుందని, రాజులు పరిపాలన మానేస్తారని అతను ముందే చెప్పాడు.

అతడు రాజ వంశానికి ఒక చిత్రాన్ని ఉపయోగించాడు, దానిని గొప్ప మర్రి చెట్టులా చిత్రీకరించాడు. ఈ చెట్టు దాని మూలంలో దావీదు రాజు తండ్రి యెష్షయిని కలిగి ఉంది. యెష్షయిని పై రాజుల రాజవంశం దావీదుతో ప్రారంభమై, అతని వారసుడైన సొలోమోను రాజుతో కొనసాగింది. క్రింద వివరించినట్లుగా, రాజవంశంలో తరువాతి కుమారుడు పరిపాలించినట్లు చెట్టు పెరుగుతూ అభివృద్ధి చెందింది.

యెషయా ఉపయోగించిన చిత్రం రాజవంశం ఒక పెద్ద మర్రి చెట్టుగా, రాజులు చెట్టు మొండెము నుండి అంటే స్థాపకుడి మూలం నుండి విస్తరించేను –  యెష్షయి

మొదట ఒక చెట్టు… తరువాత ఒక మొద్దు… తరువాత ఒక కొమ్మ (చిగురు)

ఈ  రాజవంశం ‘చెట్టు’ త్వరలోనే నరికివేయబడుతుందని, అది చనిపోయిన మొద్దుగా మారుతుందని యెషయా హెచ్చరించాడు. మొద్దు, చిగురు యొక్క భవిష్యత్తు గురించి అతను ఎలా వ్రాశాడో మీరు ఇక్కడ చూడండి:

ష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

యెషయా 11:1-2
రాజవంశం ఒకరోజు చనిపోయిన మొద్దుగా అవుతుందని యెషయా హెచ్చరించాడు

సుమారు క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో, యెషయాకు 150 సంవత్సరాల తరువాత ఈ ‘చెట్టు’ నరికివేయటం జరిగింది, బబులోనులు యెరూషలేమును జయించినప్పుడు, రాజుల రాజవంశాన్ని ముక్కలు చేసి, ఇశ్రాయేలీయులను బబులోనులు చెరకు తీసుకు వెళ్లారు (కాలక్రమం ఇది ఎరుపు కాలం). ఇది యూదుల మొదటి సారి చెరకు వెళ్ళటం – వీరిలో కొందరు భారతదేశానికి వలస వచ్చారు. సావిత్రి మరియు సత్యవంతుడు కథలో చనిపోయిన ఒక రాజు కుమారుడు – సత్యవంతుడు . మొద్దు గురించి ప్రవచించిన ప్రవచనంలో రాజుల శ్రేణి అంతా ముగిసిపోతుంది మరియు రాజవంశం కూడా చనిపోతుంది.

కొమ్మ: దావీదుకు కలిగిన జ్ఞానం నుంచి ‘ఆయన’ వస్తున్నాడు

యెష్షయి చనిపోయిన మొద్దు నుండిచిగురు

కానీ ప్రవచనం రాజులను నరికివేయడం కంటే భవిష్యత్తును మరింత ముందుకు చూసింది. ఇది మర్రి చెట్టు యొక్క సాధారణ లక్షణాన్ని ఉపయోగించేల చేసింది. మర్రి విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి ఇతర చెట్ల మొద్దు పై తరచుగా లేస్తాయి. మొలకెత్తిన మర్రి విత్తనానికి మొద్దు ఒక అతిధి. మర్రి విత్తనాలు ఒకసారి మొలకెత్తిన తర్వాత అది అతిధిగా ఉన్నమొద్దును మించిపోతుంది. ఈ చిగురుని యెషయా ముందుగా ఉహించాడు ఇది  ఒక మర్రి చెట్టులా ఉంటుంది, ఎందుకంటే కొత్త చిగురు దాని వేరులు నుండి పైకి వెళుతుంది – ఒక కొమ్మను ఏర్పరుస్తుంది. 

యెషయా ఈ ఊహాను ఉపయోగించి ప్రవచించెను, భవిష్యత్తులో ఒక రోజు మొద్దు అని పిలువబడేది ఒక కొమ్మల చనిపోయినమొద్దు నుంచి బయటకి వచ్చిది, చెట్టు మొద్దు నుండి మర్రి చిగురు మొలకెత్తినట్లు. యెషయా చిగురను ‘అతడు’ అని సూచించాడు, కాబట్టి యెషయా ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, రాజవంశం పడిపోయిన తరువాత దావీదు వంశం నుండి వస్తాడు. ఈ మనిషికి జ్ఞానం, శక్తి, జ్ఞానం వంటి లక్షణాలు ఉంటాయి, అది దేవుని ఆత్మ తనపై ఉన్నట్లుగా ఉంటుంది.

ఒక మర్రి చెట్టు దాని ఆతిధ్య మొద్దును మించిపోయింది. త్వరలో ఇది వేరులను, చిగురలను అల్లుకుని ప్రచారం చేసిది.

అనేక రచనలు పురాణాలలో మర్రి చెట్టును అమరత్వానికి ప్రతీకగా పేర్కొన్నాయి. దీని వైమానిక మూలాలు అదనపు మోండేమును ఏర్పరుస్తాయి. ఇది దీర్ఘాయువును సూచిస్తుంది, తద్వారా దైవిక సృష్టికర్తను సూచిస్తుంది. క్రీస్తుపూర్వం 750 లో యెషయా ముందుగా ఉహించిన ఈ కొమ్మ అనేక సారూప్య దైవిక లక్షణాలను కలిగి ఉంటుంది మరియు రాజవంశం ‘మొద్దు’ అదృశ్యమైన తరువాత చాలా కాలం పాటు ఉంటుంది.

యిర్మీయా మరియు కొమ్మ:

భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి ప్రవక్తయైన యెషయా సంకేతంలా సులువుగా, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాడు. కానీ అతనిది అనేక గురుతులలో మొదటిది. యెషయా తరువాత 150సంవత్సరాలకు అనగా, 600BCE లో దావీదు రాజ్య పరిపాలన ముగిసిన కాలములో ప్రవక్తయైన యిర్మీయా ఈ విధంగా వ్రాసాడు.

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

యిర్మీయా 23:5-6

దావీదు రాజ్య పరిపాలనను యెషయా వేరు చిగురుగా వివరించిన విషయమును యిర్మీయా ఇంకా దీర్ఘంగా వివరించాడు. కొమ్మ అనే మాటకు రాజు అని అర్ధం. కానీ దావీదుకు ముందు ఉన్న రాజుల ఆరిపోయిన, చనిపోయిన మొద్దు వలె కాదు.

కొమ్మ: ప్రభువు మన నీతి

కొమ్మ అనే పదం ఆయన నామములో చూసాము. దేవుని యొక్క నామము ఆయనపై ఉన్నది (ప్రభువు – హెబ్రీ భాషలో దేవుని పేరు), కాబట్టి ఒక మర్రి చెట్టు వలె, ఈ కొమ్మ దైవత్వమునకు చెందినది. మరియు ఆయన ‘మనకు’ (మానవులకు) నీతియై ఉన్నాడు.  

చనిపోయిన తన భర్తయైన సత్యవంతుడుని, సావిత్రి మరల అడగడానికి యముడు దగ్గరకు వెళ్లినప్పుడు, ఆ యముడున్ని ఎదుర్కోవడానికి ఆమె యొక్క నీతి ఆమెకు శక్తి నిచ్చింది. కుంభమేళా గురించి తెలిసిన ప్రకారం, మన పాపము లేదా అవినీతి మనకు సమస్యగా ఉంది, అందుకే మనలో నీతి లేదు. అందుకే మరణమును ఎదుర్కొనే శక్తి మనకు లేదని బైబిల్ చెప్తుంది. మరొక మాటలో చెప్పాలంటే మనము నిస్సహాయకులము:

14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
15 జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

హెబ్రీ 2:14బి-15

బైబిల్లో, సాతానుని ఒక యముడిగా పోల్చవచ్చు; ఎందుకంటే మనకు విరోధంగా మరణమును అతడు పట్టుకొని యున్నాడు. ఏ విధంగా యముడు సత్యవంతుడు శరీరం గురించి వాదించాడో, బైబిలు కూడా ఒకరి శరీరం గురించి అపవాది వాదించినట్లు చెప్తుంది. 

అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపకప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.

యూదా 1:9

సావిత్రి మరియు సత్యవంతుడు విషయంలో యముడు పోరాడినట్టే, దైవజనుడైన మోషే విషయంలో సాతాను పోరాడాడు.  మన విషయంలో కూడా సాతానుడు ఇదే విధంగా వాదిస్తాడు. అప్పుడు దేవదూతలు మోషే విషయంలో – దేవుడే అనగా – సృష్టికర్త – మాత్రమే సాతానుతో మరణ విషయంలో వాదించగలడు అని అన్నారు. 

ఇక్కడ ‘కొమ్మ’ అనే మాటకు, భవిష్యత్తులో దేవుడు మనకు ‘నీతిని’ ఇస్తాడు అనే వాగ్దానం వలన, మరణముపై మనకు జయమును ఇచ్చాడు.  

ఎలా?

సావిత్రి మరియు సత్యవంతుడు ఉదంతము విషయంలో ఉన్న కొమ్మ గురించి జెకర్యా తన పుస్తకంలో ఈ ఇతివృత్తాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు మరిన్ని వివరాలను నింపుతు, రాబోయే కొమ్మ పేరును సమాంతరంగా వివరించాడు. అది మనము తరువాత చూద్దాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *