Skip to content

యూదుల చరిత్ర: భారత దేశములో & ప్రపంచమంతటా

  • by

యూదులకు భారత దేశములో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. వారు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా నివాసముంటు భారత దేశ సమాజముల మధ్య చిన్న చిన్న సమాజములుగా జీవిస్తున్నారు. మిగిలిన అల్పసంఖ్యాక మతములకు (జైనులు, సిక్కులు, బౌద్ధులు వంటివారు) భిన్నముగా, యూదులు భారత దేశము వెలుపల నుండి వచ్చి ఇక్కడ తమ నివాసమును ఏర్పరచుకున్నారు. 2017 వేసవి కాలములో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ మోది ఇశ్రాయేలునకు చారిత్రిక పర్యటనకు వెళ్లుటకు ముందు, ఇశ్రాయేలు దేశ ప్రధానమంత్రియైన నితన్యాహుతో కలిసి వార్తాపత్రికలో ఒక సమైఖ్య వ్యాసమును వ్రాశాడు. వారు ఇలా వ్రాసినప్పుడు యూదులు భారత దేశమునకు వచ్చిన ఈ విషయమును వారు గుర్తించారు:

భారత దేశములో ఉన్న యూదుల సమాజము ఎల్లప్పుడూ ఆప్యాయతతోను, గౌరవముతోను ఆహ్వానించబడింది మరియు ఏనాడు హింసను ఎదుర్కొనలేదు.

వాస్తవానికి, యూదులు భారత దేశ చరిత్ర మీద ఒక విశేషమైన ప్రభావమును చూపారు, మరియు భారత చరిత్రలో ఒక కఠినమైన మర్మమునకు పరిష్కారమును ఇచ్చారు – భారత దేశములో రచనలు ఎలా ఆరంభమైయ్యాయి? ఈ ప్రశ్నకు జవాబు భారత సంస్కృతిలో సాంప్రదాయిక రచనలన్నిటి మీద ప్రభావం చూపుతుంది.

భారత దేశములో యూదుల చరిత్ర

భిన్నముగా ఉన్నప్పటికీ, యూదులు సాంప్రదాయిక భారత దేశ వస్త్రధారణను అనువర్తించుకున్నారు

యూదుల సమాజములు భారత దేశములో ఎంత కాలము నుండి నివసించుచున్నాయి? ‘ఇరవై ఏడు శతాబ్దములు” తరువాత మిజోరాంలో ఉన్న మనష్షే గోత్రమునకు (బెని మనషే) చెందిన యూదులు ఇశ్రాయేలు దేశమునకు తిరిగివచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇస్రాయెల్ పత్రిక ఈ మధ్య ఒక వ్యాసమును ప్రచురించింది. అంటే తమ పితరులు క్రీ.పూ. 700 సంవత్సరములో ఇక్కడకి వచ్చినట్లు అది సూచిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ లో నివసించుచున్న ఎఫ్రయిము అను యూదుల గోత్రమునకు చెందిన (బెనె ఎఫ్రాయిమ్) వారి తెలుగు మాట్లాడు సోదరులు పర్షియా, ఆఫ్గనిస్తాన్, టిబెట్, మరియు చైనా దేశములలో సంచరిస్తు చివరికి వెయ్యి సంవత్సరముల క్రితం భారత దేశమునకు వచ్చిన జ్ఞాపికను వెల్లడి చేస్తారు. కేరళ రాష్ట్రములో, కొచ్చిన్ యూదులు అక్కడ రెండు వేల ఆరు వందల సంవత్సరములుగా నివసిస్తున్నారు. కొన్ని శతాబ్దములుగా యూదులు భారత దేశమంతా చిన్న చిన్న సమాజములను నిర్మించుకున్నారు. కాని ఇప్పుడు వారు భారత దేశమును విడచి ఇశ్రాయేలుకు వెళ్లుచున్నారు.

కొచ్చిన్ లోని యూదుల సమాజమందిరములోని ఒక శిలాఫలకము. ఇది వందల సంవత్సరములుగా అక్కడ ఉంది

యూదులు భారత దేశములో నివసించుటకు ఎలా వచ్చారు? ఇంత కాలము తరువాత వారు ఇశ్రాయేలుకు తిరిగి ఎందుకు వెళ్తున్నారు? వేరే అన్ని దేశముల కంటే ఎక్కువగా వారి చరిత్రను గూర్చి మనకు సత్యములు అందుబాటులో ఉన్నాయి. ఒక కాలక్రమమును ఉపయోగించి వారి చరిత్రను క్రోడీకరించుటకు మనము ఈ సమాచారమును ఉపయోగించుదాము.

అబ్రాహాము: యూదుల కుటుంబము ఆరంభమైయ్యింది

అబ్రాహాముతో ఈ కాలక్రమము ఆరంభమవుతుంది. అతనికి దేశముల వాగ్దానము ఇవ్వబడినది, మరియు అతడు దేవునితో అనేకమార్లు కలుసుకొని తుదకు తన కుమారుడైన ఇస్సాకును చిహ్నాత్మకముగా బలి అర్పించాడు. యేసు (యేసు సత్సంగ్) యొక్క భవిష్యత్ బలి కొరకు స్థలమును సూచించుట ద్వారా ఇది యేసు వైపుకు చూపు ఒక చిహ్నముగా ఉన్నది. ఇస్సాకు కుమారునికి దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు వారసులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలమును సూచించు కాలక్రమము పచ్చ రంగులో కొనసాగుతుంది. ఈ కాలము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు (వంశావళి: అబ్రాహాము -> ఇస్సాకు -> ఇశ్రాయేలు (ఈయనకు యాకోబు అని కూడా పేరు) -> యోసేపు)  ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు నడిపించుటతో ఆరంభమవుతుంది, మరియు వారు అక్కడ బానిసలుగా చేయబడ్డారు.

ఫరోకు బానిసలుగా ఐగుప్తులో జీవించుట

మోషే: దేవుని ఆధీనములో ఇశ్రాయేలీయులు ఒక దేశమయ్యారు

ఐగుప్తును నాశనము చేసి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి ఇశ్రాయేలు దేశమునకు నడిపించిన పస్కా తెగులు తరువాత మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు నడిపించాడు. అతడు మరణించుటకు ముందు, మోషే ఇశ్రాయేలీయుల మీద ఆశీర్వాదములను మరియు శాపములను ప్రకటించాడు (ఇక్కడ కాలక్రమము పసుపు రంగులో ఉంది). వారు దేవునికి విధేయులైతే ఆశీర్వదించబడతారు, కాకపోతే శపించబడతారు. ఇశ్రాయేలు చరిత్ర తరువాత ఈ ఆశీర్వాదములకు మరియు శాపములకు కట్టుబడియుంది.

కొన్ని వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించారు కాని వారికి రాజు లేడు, మరియు యెరూషలేము వారికి రాజధానిగా ఉండేది కాదు – ఆ కాలములో అది వేరొక ప్రజల ఆధీనములో ఉండేది. అయితే, రాజైన దావీదు కాలములో క్రీ.పూ. 1000లో ఇది మార్పు చెందింది.
యెరూషలేము నుండి పాలించిన దావీదు సామ్రాజ్యపు రాజుల పరిపాలనలో జీవించుట

దావీదు యెరూషలేములో ఒక రాజరిక సామ్రాజ్యమును స్థాపించాడు

దావీదు యెరూషలేమును జయించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అతడు రానున్న మెస్సీయను గూర్చి వాగ్దానమును పొందుకున్నాడు, మరియు ఆ కాలము మొదలుకొని ‘క్రీస్తు’ రాక కొరకు యూదులు ఎదురు చూశారు. ధనికుడు మరియు ప్రఖ్యాతిగాంచినవాడైన, అతని కుమారుడైన సొలొమోను అతని తరువాత రాజ్యమును పాలించి యెరూషలేములోని మోరీయ పర్వతము మీద మొదటి యూదుల దేవాలయమును నిర్మించాడు. దావీదు రాజు యొక్క వారసులు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పాటు పాలించుట కొనసాగించారు మరియు ఈ కాలము నీలం రంగులో చూపబడుతుంది (క్రీ.పూ. 1000 – 600). ఇది ఇశ్రాయేలీయుల మహిమ కాలము – ఆ కాలములో వారు వాగ్దానము చేయబడిన ఆశీర్వాదములను పొందుకున్నారు. వారు ఒక శక్తివంతమైన దేశముగా ఉండేవారు; వారి సమాజము, సంస్కృతి మరియు దేవాలయము పురోగతి చెందినదిగా ఉండేవి. అయితే ఈ కాలములో వారి మధ్య ఎదిగిన భ్రష్టత్వమును గూర్చి కూడా పాత నిబంధన వర్ణిస్తుంది. వారు మార్పు చెందని యెడల మోషే చెప్పిన శాపములు వారి మీదికి వస్తాయని ఈ కాలములో అనేకమంది ఋషులు ఇశ్రాయేలీయులను హెచ్చరించారు. ఈ కాలములో ఇశ్రాయేలీయులు రెండు రాజ్యములుగా విడిపోయారు: ఇశ్రాయేలు లేక ఎఫ్రాయిము అని పిలువబడు ఉత్తర రాజ్యము, మరియు యూదా అని పిలువబడు దక్షిణ రాజ్యము (నేటి కొరియన్ల వలె, ఒకే ప్రజల గుంపు రెండు దేశములుగా విడిపోవుట – ఉత్తర మరియు దక్షిణ కొరియా).

యూదుల మొదటి చెర: అష్షురు & బబులోను

చివరిగా, వారి మీద రెండు విడతలుగా శాపములు దిగివచ్చాయి. క్రీ.పూ. 722లో అష్షురీయులు ఉత్తర రాజ్యమును నాశనము చేసి అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులను తమ రాజ్యమంతటిలో చెరకు తీసుకొనిపోయారు. మిజోరాంలో ఉన్న బెనె మనష్షే మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బెనె ఎఫ్రాయిమ్ వారు ఈ కాలమూలో చెరకు తేబడిన ఇశ్రాయేలీయులే. తరువాత క్రీ.పూ 586లో నెబుకద్నేజరు అను బబులోనీయుల బలమైన రాజు తొమ్మిది వందల సంవత్సరముల క్రితం మోషే వ్రాసిన శాపమునకు అనుగుణంగా దక్షిణ రాజ్యమునుచెరగొని పోయాడు:

49 ​యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, 
50 క్రూరముఖము కలిగి వృద్ధులను ¸°వనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. 
51 నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. 
52 ​మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.

ద్వితీయోపదేశకాండము 28: 49-52

నెబుకద్నేజరు యెరూషలేమును జయించి, దానిని కాల్చివేసి, సొలొమోను నిర్మించిన దేవాలయమును నాశనము చేశాడు. తరువాత అతడు ఇశ్రాయేలీయులను బబులోనును చెరగొనిపోయాడు. ఇది మోషే చేసిన ప్రవచనమును నెరవేర్చింది

63 కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. 
64 ​దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. 

ద్వితీయోపదేశకాండము 28:63-64
జయించబడి బబులోనుకు చెరగొనిపోబడింది

 కేరళలోని కొచ్చిన్ ప్రాంతములో ఉన్న యూదులు ఈ సమయములో చెరగొనిపోబడిన యూదులు. డెబ్బై సంవత్సరముల పాటు, ఇది ఎరుపు రంగులో చూపబడింది, ఈ ఇశ్రాయేలీయులు (లేక నేడు పిలువబడుచున్నట్లు యూదులు)  అబ్రాహాముకు మరియు అతని వారసులకు వాగ్దానము చేయబడిన భూమికి వెలుపల నివసించారు.

 భారత సమాజముపై యూదులు చూపిన ప్రభావం

అశోక స్తంభము మీద బ్రహ్మి లిపి (క్రీ.పూ. 250 BCE)

 భారత దేశములో ఆరంభమైన రచనలను గూర్చిన ప్రశ్నను మనము చూద్దాము. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళము వంటి ఆధునిక భారత దేశ భాషలు మరియు ఋగ్వేదము మరియు ఇతర సాంప్రదాయక సాహిత్యము వ్రాయబడిన పురాతన సంస్కృతము వంటి భాషలను బ్రహ్మిక్ లిపులు అని పిలుస్తారు, మరియు ఇవన్నీ బ్రాహ్మి లిపి అని పిలువబడు పురాతన లిపి నుండి వెలువడినవి. బ్రాహ్మి లిపి నేడు అశోకుని కాలము వంటి కొన్ని పురాతన స్మారకముల మీద మాత్రమే కనిపిస్తుంది.

ఈ బ్రహ్మి లిపి ఆధునిక లిపులుగా ఎలా పరివర్తన చెందినదో అర్థము చేసుకోవచ్చుగాని, అసలు ఈ బ్రహ్మి లిపి భారత దేశమునకు ఎలా వచ్చింది అను విషయములో మాత్రం స్పష్టతలేదు. బ్రహ్మి లిపి హెబ్రీ-ఫొయినిషియన్ లిపితో సంబంధము కలిగియున్నదని పండితులు గుర్తిస్తారు, మరియు ఇది ఇశ్రాయేలులోని యూదులు భారత దేశములోనికి వలసవచ్చినప్పుడు ఉపయోగించిన లిపి అయ్యున్నది. చరిత్రకారుడైన డా. అవిగ్దోర్ షాచన్ (1) చెరలోని వచ్చి భారత దేశములో స్థిరపడిన ఇశ్రాయేలీయులు హెబ్రీ- ఫొయినిషియన్  లిపిని తెచ్చారని అది తరువాత బ్రహ్మి లిపి అయ్యింది అని ప్రతిపాదిస్తారు. బ్రహ్మి లిపికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఇది తెలియజేస్తుంది. అబ్రాహాము దేశములో నుండి చెరగొనిపోబడివచ్చిన యూదులు భారత దేశములో స్థిరపడిన కాలములోనే ఉత్తర భారత దేశములో బ్రహ్మి లిపి ప్రత్యక్షమగుట కేవలం ఒక యాదృచ్చికమేనా? అబ్రాహాము వారసుల యొక్క లిపిని అన్వయించుకున్న స్థానికులు దానిని (అ)బ్రహామిన్ లిపి అని పిలిచారు. అబ్రాహాము మతము ఒకే దేవుని నమ్మింది మరియు ఆయన కార్యములు పరిమితమైనవి కావు. ఆయన మొదటివాడు, కడపటివాడు, నిత్యుడు. (అ)బ్రహాము ప్రజల మతములో నుండే బ్రహ్మన్ మీద నమ్మకము కూడా ఇక్కడే మొదలైయుండవచ్చు. తమ లిపిని మరియు మతమును భారత దేశమునకు తెచ్చిన యూదులు, దేశమును స్వాధీనపరచుకొని పాలించాలని ప్రయత్నించిన ఇతరుల కంటే ఎక్కువగా భారత దేశము యొక్క ఆలోచన మరియు చరిత్ర మీద ప్రభావము చూపారు. మరియు హెబ్రీ- ఫొయినిషియన్/బ్రహ్మి లిపిలో వ్రాయబడిన హెబ్రీ వేదములు, రానున్న వానిని గూర్చి తెలియజేస్తాయి, ఇది సంస్కృతములోని ఋగ్వేదములు ఉన్న రానున్న పురుషను పోలియున్నది. తమ పితరుల దేశము నుండి పశ్చిమ ఆసియాలోనికి చెరగొనిపోబడి వచ్చిన యూదుల యొక్క చరిత్ర మీద మరొకసారి దృష్టిపెడదాము.

పారసీకుల పరిపాలనలో చెరలో నుండి తిరిగివచ్చుట

అటు తరువాత, పారసీక రాజైన కొరేషు బబులోనును జయించి ప్రపంచములోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు. యూదులు తమ దేశమునకు తిరిగివెళ్లుటకు అతడు అనుమతినిచ్చాడు.

పారసీక సామ్రాజ్యములో భాగముగా దేశములో నివసించుట

అయితే వారు స్వతంత్ర దేశముగా మాత్రం కాలేదు, వారు పారసీక సామ్రాజ్యములో ఒక సంస్థానమైయ్యారు. ఇది రెండు వందల సంవత్సరముల పాటు కొనసాగింది మరియు కాలక్రమములో గులాబీ రంగులో ఉంది. ఈ కాలములో యూదుల దేవాలయము (దీనిని రెండవ దేవాలయము అని పిలుస్తారు) మరియు యెరూషలేము పట్టణము పునర్నిమించబడ్డాయి. ఇశ్రాయేలుకు తిరిగివచ్చుటకు యూదులకు అనుమతి ఇవ్వబడినప్పటికీ, అనేకమంది చెరలోనే విదేశాలలో ఉండిపోయారు.

గ్రీకుల కాలము

అలెగ్జాండర్ మహా చక్రవర్తి పారసీకుల సామ్రాజ్యమును జయించి మరొక రెండు వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలును గ్రీకు సామ్రాజ్యములో ఒక సంస్థానముగా చేశాడు. ఇది నిండు నీలము రంగులో చూపించబడింది.

గ్రీకు సామ్రాజ్యములలో భాగముగా దేశములో నివసించుట

రోమీయుల కాలము

తరువాత రోమీయులు గ్రీకు సామ్రాజ్యములను ఓడించి ప్రపంచ శక్తిగా ఆధిపత్యము చెలాయించారు. యూదులు మరొకసారి ఈ సామ్రాజ్యములో సంస్థానమైయ్యారు మరియు ఇది లేత పసుపు రంగులో చూపబడింది. ఈ సమయములో యేసు జీవించాడు. సువార్తలలో రోమా సైనికులు ఎందుకు ఉన్నారో ఇది వివరిస్తుంది – యేసు జీవితమునకు ముందు ఇశ్రాయేలులోని యూదులను రోమీయులు పాలించారు కాబట్టి.

రోమా సామ్రాజ్యములో భాగముగా దేశములో నివసించుట

రోమీయుల నాయకత్వములో యూదుల రెండవ చెర

బబులోనీయుల కాలము మొదలుకొని (క్రీ.పూ. 586) దావీదు రాజుల కాలము వలె యూదులు స్వతంత్రులుగా ఉండేవారు కాదు. స్వాతంత్ర్యమునకు ముందు బ్రిటిష్ వారు భారత దేశమును పాలించిన విధముగానే, ఇతర సామ్రాజ్యములు వారిని పాలించాయి. యూదులు దీనిని ద్వేషించి రోమా పరిపాలన మీద తిరిగిబాటు చేశారు. రోమీయులు వచ్చి యెరూషలేమును నాశనం చేసి (క్రీ.శ. 70), రెండవ దేవాలయమును కాల్చివేసి, రోమా సామ్రాజ్యమంతటిలో బానిసలుగా ఉండుటకు యూదులను చెరగొనిపోయారు. ఇది యూదుల రెండవ చెర. రోమా సామ్రాజ్యము చాలా పెద్దదిగా ఉండేది కాబట్టి, యూదులు ప్రపంచము యొక్క నలుమూలలకు చెదిరిపోయారు.

క్రీ.శ. 70లో యెరూషలేము మరియు దేవాలయమును రోమీయులు ధ్వంసం చేశారు. యూదులు ప్రపంచము నలుమూలల చెదిరిపోయారు

యూదులు సుమారుగా రెండు వేల సంవత్సరముల పాటు ఈ విధంగా నివసించారు: అన్య దేశములకు చెదిరిపోయారుగాని, ఆ దేశములవారు వారిని అంగీకరించలేదు. అనేక దేశములలో వారు తరచుగా భయంకరమైన హింసను ఎదుర్కొన్నారు. యూదుల మీద హింస ఐరోపాలో ఎక్కువగా జరిగింది. పశ్చిమ ఐరోపాలోని స్పెయిన్ దేశము మొదలుకొని రష్యా వరకు ఈ రాజ్యములలావు యూదులు భయంకరమైన పరిస్థితుల మధ్య నివసించారు. ఈ హింసలను తప్పించుకొనుటకుగాను యూదులు కొచ్చిన్ కి రావడం ఆరంభించారు. పశ్చిమ ఆసియాలోని యూదులు పదిహేడు, పద్దెనిమిదయ శతాబ్దములలో భారత దేశములోని ఇతర భాగములకు వచ్చుట ఆరంభించారు.

డేవిడ్ సస్సన్ & సన్స్ – భారత దేశములో నివసించిన ధనికులైన బఘ్దాది యూదులు

వీరిని బఘ్దాది యూదులు అని పిలచేవారు, వీరు ముంబై, ఢిల్లీ, మరియు కలకత్తా వంటి చోట్ల స్థిరపడ్డారు. క్రీ.పూ. 1500లలో మోషే ఇచ్చిన శాపములకు అనుగుణంగానే వారు జీవించడం జరిగింది.

65 ​ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. 

ద్వితీయోపదేశకాండము 28:65

ఇశ్రాయేలీయులకు విరోధముగా ఇవ్వబడిన శాపముల కారణంగా ప్రజలు ఇలా ప్రశ్నించుట ఆరంభించారు:

24 యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

ద్వితీయోపదేశకాండము 29:24

మరియు దీనికి జవాబు:

25 మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి 
26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి 
27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. 
28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. 

ద్వితీయోపదేశకాండము 29:25-28

క్రింద ఇవ్వబడిన కాలక్రమము ఈ పంతొమ్మిదివందల సంవత్సరాల కాలమును చూపుతుంది. ఇది సుదీర్ఘమైన ఎరుపు రంగు గీతలో చూపబడింది.

యూదుల యొక్క విస్తృతమైన చారిత్రిక కాలక్రమము – వారి రెండు చెర కాలములు ఇవ్వబడినవి

యూదా ప్రజలు తమ చరిత్రలో రెండు చెర కాలములను అనుభవించారు అని మీరు చూడవచ్చు, కాని రెండవ చెర మొదటి చెర కాలము కంటే చాలా సుదీర్ఘమైనదిగా ఉన్నది.

ఇరవైయ్యవ శతాబ్దపు మారణహోమం (హోలోకాస్ట్)

హిట్లర్, నాజీ జర్మనీ ద్వారా ఐరోపాలో ఉన్న యూదులందరినీ హతమార్చాలని ప్రయత్నించినప్పుడు యూదులపై హింస తారాస్థాయికి చేరింది. అతడు ఇంచుమించు సఫలీకృతుడైయ్యాడుగాని, చివరికి అతడు ఓడించబడ్డాడు మరియు యూదుల శేషము మిగిలిపోయ్యింది.

ఇశ్రాయేలు యొక్క ఆధునిక పునర్జన్మ

మాతృభూమి లేకుండా కొన్ని వేల సంవత్సరముల తరువాత ‘యూదులు’ అను వారు మిగిలియున్నారంటే ఇది ఆశ్చర్యకరమైన విషయము. కాని ఇది మూడు వేల ఐదువందల సంవత్సరాల క్రితం మోషే వ్రాసిన చివరి మాటలను కలిగియుంటుంది. 1948లో, మోషే కొన్ని శతాబ్దముల క్రితం వ్రాసిన విధముగా, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆధునిక ఇశ్రాయేలు యొక్క పునర్జన్మను లోకము చవిచూసింది:

​నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 
​మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. 
నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. 

ద్వితీయోపదేశకాండము 30:3-5

గొప్ప ప్రతిఘటన మధ్య ఈ దేశము స్థాపించబడుట కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయము. చుట్టుపక్కల ఉన్న దేశములన్నీ కలిసి 1948లో … 1956లో … 1967లో మరియు 1973లో ఇశ్రాయేలు మీదికి యుద్ధమునకు వచ్చాయి. చాలా చిన్న దేశమైన ఇశ్రాయేలు కొన్ని సందర్భాలలో ఒకేసారి ఐదు దేశముల మీద యుద్ధము చేసింది. మరియు ఇశ్రాయేలు నిలువబడుట మాత్రమేగాక, దాని సరిహద్దులు పెరిగాయి. 1967లో జరిగిన ఆరురోజుల యుద్ధములో, మూడు వేల సంవత్సరముల క్రితం దావీదు స్థాపించిన దాని చారిత్రిక రాజధానియైన యెరూషలేమును ఇశ్రాయేలు తిరిగి సంపాదించుకుంది. ఇశ్రాయేలు దేశము యొక్క స్థాపనకు ఫలితంగా, మరియు ఈ యుద్దముల వలన కలిగిన పరిణామముల కారణంగా నేడు ప్రపంచములోనే అత్యంత కఠినమైన రాజకీయ సమస్యను మనము ఎదుర్కొనుచున్నాము.

మోషే ద్వారా ప్రవచించబడినట్లు మరియు ఇక్కడ మరింత స్పష్టముగా వివరించబడినట్లు, ఇశ్రాయేలు యొక్క పునర్జన్మ భారత దేశములో ఉన్న యూదులు ఇశ్రాయేలుకు తిరిగివెళ్లుటకు ఒక అవకాశమును ఇచ్చింది. తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత దేశమునకు చెందినవారైన యూదులు ఇశ్రాయేలులో ఎనబై వేల మంది ఉన్నారు మరియు నేడు భారత దేశములో కేవలం ఐదు వేల మంది యూదులు మాత్రమే మిగిలియున్నారు. మోషే ఇచ్చిన ఆశీర్వాదము ప్రకారం వారు అత్యంత ‘దూర దేశము’ల నుండి (మిజోరాం వంటి) కూడా ‘సమకూర్చబడుతున్నారు మరియు ‘తిరిగి’ తీసుకొనిరాబడుతున్నారు. దీని అంతర్భావములను యూదులు మరియు యూదులు కానివారు కూడా గమనించాలని మోషే వ్రాశాడు.

(1) డా. అవిగ్దోర్ షాచన్.  ఇన్ ది ఫుట్స్టెప్స్ ఆఫ్ ది లోస్ట్ టెన్ ట్రైబ్స్ పేజీ 261

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *