Skip to content

పది ఆజ్ఞలు: కలియుగములో కరోనా వైరస్ పరీక్ష వంటిది

  • by

మనము కలియుగములో జీవిస్తున్నామని సహజంగా అందరు ఒప్పుకుంటారు. ఇది నాలుగు యుగములలో చివరిది. మిగిలిన మూడు యుగములు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. ఈ నాలుగు యుగములలో సామాన్యముగా ఏమి కనిపిస్తుంది అంటే, మొదటి యుగమైన సత్యయుగము మొదలుకొని, మనము ప్రస్తుతము నివసించుచున్న కలియుగము వరకు నైతిక మరియు సామాజిక పతనము క్రమక్రమముగా జరుగుతు వస్తుంది.

మహాభారతములోని మార్కండేయుడు కలియుగములో మానవ స్వభావమును ఈ విధంగా వర్ణించాడు:

కోపము, ఉగ్రత మరియు అజ్ఞానము పెరుగుతాయి

ధర్మము, సత్యము, పరిశుభ్రత, సహనము, కరుణ, భౌతిక శక్తి మరియు జ్ఞాపకము దినదినము కృశించిపోతాయి.

ఎలాంటి కారణము లేకుండా ప్రజలు హత్యచేయు ఆలోచనలను తలపెడతారు మరియు దానిలోని తప్పును గ్రహింపరు.

వ్యామోహమును సామాజికముగా అంగీకరిస్తారు మరియు లైంగిక సంభోగమును జీవితము యొక్క ముఖ్యమైన అవసరతగా పరిగణిస్తారు.

పాపము బహుగా పెరిగిపోతుంది, కాని మంచితనము అంచెలంచెలుగా అంతరించిపోతుంది.

ప్రజలు మత్తును కలిగించు పానీయములకు మరియు మాదకద్రవ్యాలకు బానిసలవుతారు.

గురువులను గౌరవించుట మానివేస్తారు మరియు వారి శిష్యులు వారిని గాయపరుస్తారు. వారి బోధలను హేళన చేస్తారు, మరియు కామమును అనుసరించువారు మానవుల యొక్క మనస్సులపై పట్టును సంపాదిస్తారు.

భగవంతులమని లేక దేవుళ్లు ఇచ్చిన వరములమని మానవులంతా తమను గూర్చి తాము ప్రకటించుకుంటారు మరియు బోధించుటకు బదులుగా దానిని వ్యాపారముగా మార్చివేస్తారు.

ప్రజలు వివాహములు చేసుకొనుట మాని కేవలం కామ వాంఛలను తీర్చుకొనుటకు సహజీవనం చేస్తారు.

మోషే మరియు పది ఆజ్ఞలు

మన ప్రస్తుత యుగమును హెబ్రీ వేదములు కూడా ఇంచుమించు ఇదే విధంగా వర్ణిస్తాయి. పాపము చేయుటకు మానవులు వాంఛను కలిగియున్నందున, వారు పస్కా ద్వారా ఐగుప్తు నుండి తప్పించుకొని వచ్చిన తరువాత కొంత కాలమునకు దేవుడు మోషే ద్వారా పది ఆజ్ఞలను ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు నడిపించుట మాత్రమే మోషే యొక్క లక్ష్యము కాదుగాని, వారిని ఒక నూతన జీవన విధానములోనికి నడిపించుట కూడా అతని లక్ష్యమైయుండెను. కాబట్టి ఇశ్రాయేలీయులను విడిపించిన పస్కా దినమునకు యాబై రోజులు తరువాత, మోషే వారిని సీనాయి పర్వతము (హోరేబు పర్వతము) యొద్దకు నడిపించాడు, అక్కడ వారు దేవుని ధర్మశాస్త్రమును పొందుకున్నారు. కలియుగములోని సమస్యలను వెలికితీయుటకు ఈ ధర్మశాస్త్రము కలియుగములో ఇవ్వబడినది.

మోషే పొందుకున్న ఆజ్ఞలు ఏవి? ధర్మశాస్త్రమంతా చాలా పెద్దదైనప్పటికీ, మోషే మొదటిగా రాతి పలకల మీద వ్రాయబడియున్న కొన్ని నైతిక ఆజ్ఞలను దేవుని నుండి పొందుకున్నాడు, వీటిని పది ఆజ్ఞలు(లేక డెకలోగ్) అని పిలుస్తారు. ఈ పది ఆజ్ఞలు ధర్మశాస్త్రము అంతటి యొక్క సారాంశముగా ఉన్నాయి – సూక్ష్మ వివరములను తెలుపుటకు ముందు ఇవ్వబడిన నైతిక విలువలు – మరియు ఇవి కలియుగములో ఉన్న భ్రష్టత్వముల నుండి పశ్చాత్తాపపడునట్లు మనలను ప్రోత్సహించుటకు దేవుడిచ్చిన క్రియాశీల శక్తిగా ఉన్నాయి.

పది ఆజ్ఞలు

దేవుడు రాతి పలకల మీద వ్రాసిన, తరువాత మోషే హెబ్రీ వేదములలో నమోదు చేసిన పది ఆజ్ఞల పట్టిక ఈ క్రింద ఇవ్వబడినది.

వుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
5 ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
8 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
9 ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
10 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
12 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
13 నరహత్య చేయకూడదు.
14 వ్యభిచరింపకూడదు.
15 దొంగిలకూడదు.
16 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పె

ను. నిర్గమకాండము 20:1-17

పది ఆజ్ఞల యొక్క ప్రమాణము

ఇవి ఆజ్ఞలని నేడు మనము కొన్నిసార్లు మరచిపోతుంటాము. ఇవి సలహాలు కావు. ఇవి ప్రతిపాదనలు కూడా కావు. అయితే ఈ ఆజ్ఞలను మనము ఎంత వరకు పాటించాలి? పది ఆజ్ఞలు ఇవ్వబడుటకు ముందు ఈ క్రింది మాటలు వ్రాయబడ్డాయి

  3 మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా
4 నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.
5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.

నిర్గమకాండము 19:3,5

పది ఆజ్ఞల తరువాత ఈ మాటలు వ్రాయబడ్డాయి

  7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.

నిర్గమకాండము 24:7

కొన్నిసార్లు స్కూల్ పరీక్షలలో, అధ్యాపకుడు కొన్ని ప్రశ్నలను ఇచ్చి (ఉదాహరణకు ఇరవై) వాటిలో కొన్నిటికి మాత్రమే జవాబులు వ్రాయమని చెబుతాడు. ఉదాహరణకు, ఇరవై ప్రశ్నలలో ఒక పదిహేను ప్రశ్నలను ఎంపిక చేసుకొని మనము జవాబివ్వవచ్చు. ప్రతి విద్యార్థి కూడా అతనికి/ఆమెకు సులువుగా ఉన్న పదిహేను ప్రశ్నలను ఎన్నుకొని వాటికి జవాబివ్వవచ్చు. ఈ విధంగా అధ్యాపకుడు పరీక్షను కొంత వరకు సులభతరం చేస్తాడు.

చాలా మంది పది ఆజ్ఞలను గూర్చి కూడా ఈ విధంగానే ఆలోచిస్తారు. దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చిన తరువాత “వీటిలో మీకు నచ్చిన ఆరింటిని పాటించండి” అని చెప్పినట్లు వారు ఆలోచిస్తారు. దేవుడు మన ‘చెడు క్రియలను’ మరియు ‘సత్క్రియలను’ సమతుల్యం చేస్తున్నాడని మనమనుకుంటాము కాబట్టి ఇలా ఆలోచన చేస్తాము. మనము చేయు మంచి పనులు మనలోని చెడ్డ క్రియలను కొట్టివేయగలిగితే దేవుని కనికరమును పొందుటకు ఇది సరిపోతుంది అని మనము ఆశించవచ్చు. 

అయితే, అవి ఈ విధంగా ఇవ్వబడలేదని పది ఆజ్ఞలను నిజాయితీగా చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రజలు అన్ని ఆజ్ఞలను అన్ని వేళల పాటించాలి మరియు వీటికి విధేయులవ్వాలి. వీటిని పాటించుటలో ఎదురయ్యే కష్టముల కారణంగానే అనేకమంది పది ఆజ్ఞలను తిరస్కరిస్తారు. అయితే అవి కలియుగములో జరుగు క్రియలను అధిగమించుటకు కలియుగములో ఇవ్వబడినవి.

పది ఆజ్ఞలు మరియు కరోనా వైరస్ పరీక్ష

2020లో లోకమును అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారితో పోల్చుట ద్వారా కలియుగములో ఇవ్వబడిన కఠినమైన పది ఆజ్ఞల యొక్క ఉద్దేశ్యమును మనము అర్థము చేసుకోవచ్చు. COVID-19 అనునది కరోనా వైరస్ – మన కంటికి కనిపించని ఒక చాలా సూక్ష్మమైన వైరస్ – ద్వారా కలుగు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకొనుటకు కష్టమగుట వంటి లక్షణములను కలిగిన వ్యాధి. 

ఒక వ్యక్తికి జ్వరము, దగ్గు వచ్చాయని ఊహించండి. అసలు సమస్య ఏమిటని ఆ వ్యక్తి ఆలోచిస్తుంటాడు. అతనికి/ఆమెకు ఒక సామన్య జ్వరము వచ్చిందా లేక కరోనా వైరస్ వచ్చిందా? కరోనా వైరస్ అయితే అది చాలా తీవ్రమైన సమస్య – ప్రాణము కూడా పోవచ్చు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి మరియు ఎవరికైనా అది సోకవచ్చు కాబట్టి అది కరోనా వైరస్ అయ్యుండవచ్చు. వారి జీవితములో కరోనా ఉన్నాదో లేదో నిర్థారించుటకు వారికి ఒక విశేషమైన పరీక్ష చేయబడుతుంది. కరోనా వైరస్ పరీక్ష వారి వ్యాధిని నయం చేయదుగాని, వారిలో COVID-19కు కారణమైయ్యే కరోనా వైరస్ ఉన్నదో లేదో, లేక అది కేవలం ఒక సామన్య జ్వరమో నిర్థారించి చెబుతుంది.

పది ఆజ్ఞల విషయములో కూడా ఇదే వాస్తవమైయున్నది. 2020లో కరోనా వైరస్ వ్యాపించుచున్న విధముగానే కలియుగములో నైతిక భ్రష్టత్వము కూడా వ్యాపించుచున్నది. నైతిక భ్రష్టత్వము వ్యాపించుచున్న ఈ యుగములో మనము నీతిమంతులముగా ఉన్నామో లేక మనము కూడా పాపమను మరక కలిగినవారిగా ఉన్నామో తెలుసుకోవాలని ఆశిస్తాము. మనము పాపము నుండి మరియు దాని వలన కలుగు కర్మా నుండి స్వతంత్రులముగా ఉన్నామా లేక ఇంకా పాపమును పట్టుకునే ఉన్నామా అని మన జీవితములను పరీక్షించుకొనుటకు పది ఆజ్ఞలు ఇవ్వబడినవి. పది ఆజ్ఞలు కరోనా వైరస్ పరీక్ష వలె పని చేస్తాయి – దీని ద్వారా మీకు వ్యాధి (పాపము) ఉన్నదో లేదో మీరు తెలుసుకోగలరు.

ఇతరులతో, మనతో మనము మరియు దేవునితో మనము ఎలా వ్యవహరించాలని దేవుడు కోరతాడో ఆ గురి నుండి ‘తప్పిపోవుటనే’ పాపము అంటారు. అయితే మన సమస్యను గుర్తించుటకు బదులుగా మనలను మనము ఇతరులతో పోల్చుకొంటుంటాము (సరికాని ప్రమాణములతో కొలుచుకుంటాము), మతపరమైన పుణ్యమును పొందుకొనుటకు ప్రయత్నిస్తాము, లేక అన్నిటిని విడచి మన ఇష్టానికి జీవిస్తుంటాము. కాబట్టి దేవుడు పది ఆజ్ఞలను ఈ క్రింది ఉద్దేశముతో ఇచ్చాడు:

  20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

రోమీయులకు 3:20

పది ఆజ్ఞల యొక్క ప్రమాణము వెలుగులో మన జీవితములను మనము పరీక్షించుకుంటే, అది అంతరంగ సమస్యను తెలుపు కరోనా వైరస్ పరీక్షను చేయించుకొనుటను పోలియుంటుంది. పది ఆజ్ఞలు మన సమస్యకు “పరిష్కారం” ఇవ్వవుగాని, దేవుడు ఇచ్చిన పరిష్కారమును స్వీకరించుటకు మనలోని సమస్యను స్పష్టముగా బయలుపరుస్తుంది. మనలను మనము మోసము చేసుకొనుటకు బదులుగా, మనలను మనము సరిగా విశ్లేషించుకొనుటకు ధర్మశాస్త్రము సహాయపడుతుంది.

పశ్చాత్తాపములో దేవుని బహుమానము ఇవ్వబడింది

యేసు క్రీస్తు – యేసు సత్సంగ్ – యొక్క మరణము మరియు పునరుత్థానము ద్వారా పాప క్షమాపణ అను బహుమానమును ఇచ్చుట ద్వారా దేవుడు దీనికి పరిష్కారమునిచ్చాడు. యేసు చేసిన కార్యము మీద నమ్మకము లేక విశ్వాసము ఉంటే జీవితమను బహుమానము మనకు ఇవ్వబడుతుంది.

  16 ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

గలతీయులకు 2:16

శ్రీ అబ్రాహాము దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడినట్లు, మనము కూడా నీతిమంతులుగా తీర్చబడగలము. అయితే అందుకు మనము పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపమును ప్రజలు చాలాసార్లు అపార్థం చేసుకుంటారు, కాని పశ్చాత్తాపము అంటే “మన మనస్సులను మార్చుకొనుట.” అనగా మన పాపములను విడిచి దేవుని వైపు మరియు ఆయన ఇచ్చు బహుమానము వైపుకు తిరుగుట. వేద పుస్తకము (బైబిలు) వివరించుచున్నట్లు:

  19 ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును

అపొస్తలుల కార్యములు 3:19

మనము మారుమనస్సుపొంది దేవుని వైపు తిరిగితే, మన పాపములు మనకు విరోధముగా లెక్కించబడవు మరియు మనము జీవమును పొందుతాము. దేవుడు, తన మహా కరుణతో, కలియుగములో పాపమునకు పరీక్షను మరియు వాక్సిన్ ను కూడా మనకు ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *