Skip to content

కురుక్షేత్రములో జరిగిన యుద్ధములో వలె: ‘అభిషిక్తుడైన’ నాయకుని యొక్క రాకను గూర్చి ప్రవచించబడింది

  • by

మహాభారత పురాణములో భగవద్గీత జ్ఞాన కేంద్రముగా ఉన్నది. ఇది ఒక గీతముగా (పాట) వ్రాయబడినప్పటికీ, నేడు దీనిని చదువుతారు. కురుక్షేత్ర యుద్ధమునకు – రాజుల కుటుంబము యొక్క ఇరు పక్షముల మధ్య జరిగిన యుద్ధము – ముందు ప్రభువైన కృష్ణుడు మరియు రాజరిక యుద్ధవీరుడైన అర్జునుడు మధ్య జరిగిన సంభాషణను గీత వివరిస్తుంది. ఈ యుద్ధములో పురాతన రాజరిక సామ్రాజ్యమును స్థాపించిన కురు రాజు వంశములోని రెండు శాఖలలో ఉన్న యోధులు మరియు నాయకులు తలపడ్డారు. ఈ రాజ వంశములోని ఏ శాఖకు – పాండవుల రాజు యదిష్టిరుడు లేక కౌరవుల రాజు దుర్యోధనుల మధ్య –పాలించు హక్కు ఉన్నది అని నిర్ణయించుటకు పాండవులు మరియు కౌరవులు యుద్ధమునకు దిగారు. దుర్యోధనుడు యదిష్టిరుని నుండి సింహాసనమును లాగుకున్నాడు, కాబట్టి దానిని తిరిగి సంపాదించుటకు యదిష్టిరుడు మరియు పాండవులు యుద్ధమునకు సిద్ధపడ్డారు. పాండవులలో యోధుడైన అర్జునుడు మరియు ప్రభువైన కృష్ణుడు మధ్య జరిగిన భగవద్గీత సంభాషణలో, కష్ట కాలములలో నిజమైన జ్ఞానము ఆత్మీయ స్వాతంత్ర్యమును మరియు ఆశీర్వాదమును కలిగిస్తుంది అను విషయము మీద దృష్టి సారించబడింది.

కీర్తనలు హెబ్రీ వేద పుస్తకమైన బైబిలులోని జ్ఞాన సాహిత్యమునకు కేంద్రముగా ఉన్నాయి. ఇవి పాటలుగా (గీతములుగా) వ్రాయబడిఅప్పటికీ నేడు వీటిని ప్రజలు చదువుతారు. రెండవ కీర్తన రెండు వ్యతిరేక శక్తుల మధ్య యుద్ధమునకు ముందు ఉన్నతమైన ప్రభువు మరియు ఆయన అభిషిక్తుని (=పాలకుడు) మధ్య జరిగిన సంభాషణను తెలియజేస్తుంది. ఈ రాబోవు యుద్ధమునకు రెండు వైపుల గొప్ప యోధులు మరియు నాయకులు ఉన్నారు. ఒక వైపున పురాతన రాజ వంశమును స్థాపించిన రాజైన దావీదు వారసుడు ఉన్నాడు. ఏ శాఖకు పాలించు హక్కు ఉన్నదో నిర్ణయించుటకు ఈ ఇరు పక్షములవారు యుద్ధము చేయగోరాయి. ప్రభువు మరియు ఆయన నిర్ణయించిన నాయకుని మధ్య 2వ కీర్తనలో జరిగిన సంభాషణ స్వాతంత్ర్యము, జ్ఞానము మరియు ఆశీర్వాదమును గూర్చి మాట్లాడుతుంది.

ఇవి పోలికలు కలిగియున్నాయి కదా?

సంస్కృత వేదములలోని జ్ఞానమును అర్థము చేసుకొనుటకు భగవద్గీత ఒక ప్రధాన ద్వారముగా ఉన్నట్లే, హెబ్రీ వేదములలోని (బైబిలు) జ్ఞానమును అర్థము చేసుకొనుటకు కీర్తనలు ద్వారముగా ఉన్నాయి. ఈ జ్ఞానమును పొందుకొనుటకు మనము కీర్తనలు మరియు వీటి యొక్క ప్రధాన లేఖకుడైన దావీదు రాజును గూర్చి కొంత నేపధ్య సమాచారమును తెలుసుకోవలసియున్నది.

దావీదు రాజు ఎవరు మరియు కీర్తనలు అంటే ఏమిటి?

దావీదు రాజు, కీర్తనలు మరియు ఇతర హెబ్రీ ఋషులు మరియు రచనలు చారిత్రిక కాలక్రమములో ఇవ్వబడినవి

దావీదు శ్రీ అబ్రాహాముకు వెయ్యి సంవత్సరముల తరువాత, శ్రీ మోషేకు ఐదు వందల సంవత్సరముల తరువాత సుమారుగా క్రీ.పూ 1000 కాలములో జీవించాడని ఇశ్రాయేలీయుల చరిత్రలో నుండి సేకరించబడిన కాలక్రమములో నుండి మీరు చూడవచ్చు. దావీదు తన కుటుంబములోని గొర్రెలను కాయు గొర్రెల కాపరిగా తన జీవితమును ఆరంభించాడు. ఒక గొప్ప విరోధి, ఆజానుబాహుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను జయించుటకు ఒక సైన్యమును తోడ్కొని వచ్చాడు, కాబట్టి ఇశ్రాయేలీయులు నిరుత్సాహపడి, ఓటమి చెందినవారిగా భావించుకున్నారు. దావీదు గొల్యాతుకు సవాల్ చేసి యుద్ధములో అతనిని హతమార్చాడు. ఒక గొప్ప యోధుని మీద ఒక యవ్వన గొర్రెల కాపరియైన బాలుడు సాధించిన అమోఘమైన విజయము దావీదుకు గొప్ప ఖ్యాతిని తెచ్చింది. 

అయితే, సుదీర్ఘమైన, కష్టతరమైన అనుభవముల తరువాత మాత్రమే అతడు రాజు కాగలిగాడు, ఎందుకంటే అతనికి ఇశ్రాయేలీయులలోను, మరియు బయట కూడా అనేకమంది విరోధులు ఉండిరి, మరియు వారు అతనిని వ్యతిరేకించారు. అయితే దావీదు దేవుని నమ్మాడు కాబట్టి మరియు దేవుడు అతనికి సహాయము చేశాడు కాబట్టి, దావీదు తుదకు తన విరోధులందరి మీద జయమును పొందాడు. హెబ్రీ వేదములైన బైబిలులోని పలు పుస్తకములు దావీదు పడిన ఈ సంఘర్షణలను మరియు విజయములను జ్ఞాపకము చేసుకుంటాయి.  

దావీదు ఒక ప్రఖ్యాతిగాంచిన వాయిద్యకారుడు కూడా, మరియు అతడు దేవుని కొరకు రమ్యమైన పాటలను మరియు పద్యములను కూడా వ్రాశాడు. ఈ పాటలు మరియు పద్యములు దేవుని ద్వారా ప్రేరేపించబడినవి మరియు వేద పుస్తకములోని కీర్తనల గ్రంథమును రూపొందిస్తాయి. 

కీర్తనలలో ‘క్రీస్తును’ గూర్చిన ప్రవచనాలు

అతడు గొప్ప రాజు మరియు యోధుడు అయినప్పటికీ, దావీదు కీర్తనలలో తన రాజరిక వంశములో నుండి పుట్టబోవు ‘క్రీస్తు’ను గూర్చి వ్రాశాడు మరియు ఆ క్రీస్తు శక్తిలోను, అధికారములోను అతనిని మించిపోతాడు. భగవద్గీతను పోలిన రాజరిక యుద్ధ దృశ్యమును పోలినట్లు, హెబ్రీ వేదములలోని (బైబిలు) 2వ కీర్తనలో క్రీస్తు ఈ విధముగా పరిచయం చేయబడ్డాడు.

1అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?

జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

2–మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము

రండి అని చెప్పుకొనుచు

3భూరాజులు యెహోవాకును ఆయన ‘అభిషిక్తునికిని’

విరోధముగా నిలువబడుచున్నారు

ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

4ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు

ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

5ఆయన ఉగ్రుడై వారితో పలుకును

ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును

6–నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద

నా ‘రాజు’ను ఆసీనునిగా చేసియున్నాను

7కట్టడను నేను వివరించెదను

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను

–నీవు నా కుమారుడవు

నేడు నిన్ను కనియున్నాను.

8నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను

భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

9ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు

కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా

పగులగొట్టెదవు

10కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి

భూపతులారా, బోధనొందుడి.

11భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి

గడగడ వణకుచు సంతోషించుడి.

12ఆయన కోపము త్వరగా రగులుకొనును

కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన

కోపించును

అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.

ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

కీర్తనలు 2

ఇంతకు ముందు వివరించబడినట్లు అదే వాక్యము ఈ క్రింద గ్రీకు భాష నుండి అనువదించబడింది.

న్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

కీర్తనలు 2: 1-2 – హెబ్రీ మరియు గ్రీకు (LXX) మూల భాషలలో

కురుక్షేత్ర యుద్ధము యొక్క ఫలితములు

ఇక్కడ మీరు చూస్తున్నట్లు, 2వ కీర్తనలో ‘క్రీస్తు/అభిషిక్తుడు’ అను పదము యొక్క నేపధ్యము భగవద్గీతలోని కురుక్షేత్ర యుద్దమును పోలియున్నది. అంత సుదీర్ఘముగా జరిగిన కురుక్షేత్ర యుద్ధము యొక్క ఫలితములను గూర్చి ఆలోచన చేసినప్పుడు, వాటిలో కొన్ని తేడాలు కనిపిస్తాయి. అర్జునుడు మరియు పాండవులు యుద్ధములో గెలిచారు, కాబట్టి సింహాసనమును లాగుకున్న కౌరవుల చేతిలో నుండి అధికారము మరియు పరిపాలన పాండవుల చేతికి వచ్చింది, మరియు యదిష్టిరుడు యోగ్యమైన రాజైయ్యాడు. ఐదుగురు పాండవులు మరియు కృష్ణుడు మాత్రమే పద్దెనిమిది దినముల యుద్ధములో ప్రాణాలతో బయటపడ్డారు, మరియు కొంతమంది మినహా అందరు హతము చేయబడ్డారు. అయితే ఈ యుద్ధము తరువాత ముప్పై ఆరు సంవత్సరములు మాత్రమే పాలించి యదిష్టిరుడు సింహాసనమును విడిచి, అర్జునుడు యొక్క మనవడైన పరిక్షితుడుని రాజుగా చేశాడు. తరువాత అతడు ద్రౌపది మరియు అతని సహోదరులతో కలసి హిమాలయాలకు వెళ్లిపోయాడు. ద్రౌపది మరియు నలుగురు పాండవులైన భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు మార్గమధ్యములోనే మరణించారు. యదిష్టిరునికి పరలోకములోనికి ఆహ్వానము దక్కింది. కౌరవుల తల్లియైన గాంధారి యుద్ధమును ఆపుచేయనందుకు కృష్ణుని మీద కోపపడి అతనిని శపించగా, అతడు యుద్ధమునకు ముప్పై ఆరు సంవత్సరముల తరువాత రెండు గోత్రముల మధ్య జరిగిన పోరాటములో అనుకోకుండా బాణము తగిలి మరణించాడు. కురుక్షేత్ర యుద్ధము మరియు తరువాత జరిగిన కృష్ణుని మరణము లోకమును కలియుగములోనికి నెట్టివేసింది.

కాబట్టి కురుక్షేత్ర యుద్ధము వలన మనకు ఏమి లాభము కలిగింది?

కురుక్షేత్ర యుద్ధము నుండి మనము పొందిన ఫలములు

కొన్ని వేల సంవత్సరముల తరువాత నివసిస్తున్న మనకు మరింత గొప్ప అవసరత ఉన్నది. మనము సంసారలో జీవిస్తు, నిరంతరము బాధను, రోగమును, వృద్ధాప్యమును మరియు మరణమును అనుభవిస్తాము. మనము నాయకుల యొక్క వ్యక్తిగత మిత్రులకు మరియు ధనికులకు సహాయము చేయు భ్రష్టమైన ప్రభుత్వముల ఆధీనములో నివసిస్తాము. కలియుగము యొక్క పరిణామములను మనము అనేక విధాలుగా అనుభవిస్తాము.

భ్రష్టత్వములేని ప్రభుత్వము కొరకు, కలియుగములో లేని సమాజము కొరకు, మరియు సంసారలో అంతములేని పాపము మరియు మరణము నుండి వ్యక్తిగత విమోచన కొరకు మనము ఎదురుచూస్తున్నాము.

2వ కీర్తనలోని ‘క్రీస్తు’ రాక ద్వారా మనము పొందిన ఫలములు

2వ కీర్తనలో పరిచయం చేయబడిన క్రీస్తు, ఈ మన అవసరతలను ఏ విధంగా తీర్చుతాడో హెబ్రీ ఋషులు వివరించారు. ఈ అవసరతలను తీర్చుటకు ఒక యుద్ధము జరగాలి, కాని కురుక్షేత్రములోను మరియు 2వ కీర్తనలోను తెలుపబడిన యుద్ధమునకు భిన్నమైన యుద్ధము ఒకటి జరగాలి. ఈ యుద్దమును కేవలం ‘క్రీస్తు’ మాత్రమే చేయగలడు. అధికారముతోను, బలముతోను ఆరంభించకుండా మనలను పాపము మరియు మరణము నుండి విమోచించుటకు క్రీస్తు మనలను సేవించుట ద్వారా ఆరంభిస్తాడని ప్రవక్తలు చూపారు. ఒక దినము నెరవేర్చబడు 2వ కీర్తనకు మార్గము ముందుగా మరొక విరోధిని జయించుటకు తిరిగి ప్రయాణము చేయుట ద్వారా జరుగుతుందని ఇది చూపుతుంది. ఇది సైన్య శక్తి ద్వారాగాక, సంసారకు బానిసలైన వారి కొరకు ప్రేమ చూపుట మరియు బలి అర్పించుట ద్వారా కలుగుతుంది. మనము ఈ ప్రయాణమును దావీదు రాజ వంశ వృక్షములోని ఒక మరణమైన కొమ్మలో నుండి పుట్టు చిగురుతో ఆరంభిస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *